Just In
- 1 hr ago ఈవీ ఓనర్లకు Google Maps గుడ్ న్యూస్.. ఇకపై మీకు ఈ టెన్షన్ ఉండదు.!!
- 3 hrs ago కారు ప్రియులకు గుడ్న్యూస్.. భారతీయ మార్కెట్లోకి సరికొత్త కారుతో వస్తోన్న 'ఫోర్డ్'!!
- 7 hrs ago 25 దేశాల్లో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ రెంటల్స్ అండ్ టూర్స్ సర్వీస్.. RE ఫ్యాన్స్కు పండగే
- 9 hrs ago కేవలం రూ. 8,999లకే డ్యాష్క్యామ్.. ఈ BIS కెమెరా కార్లకు పెట్టుకుంటే చాలు!!
Don't Miss
- News పవన్ ను ఆడిస్తున్న చంద్రబాబు-పెళ్ళిళ్లే కాదు సీట్లూ నాలుగే- కాకినాడలో జగన్ కామెంట్స్..!
- Sports SRH playing XI: అతనిపై వేటు..ఢిల్లీతో ఆడే తుదిజట్టు ఇదే
- Technology Lava ProWatch లావా ప్రోవాచ్ డిజైన్, ధర వివరాలు లీక్.. ఫంక్షన్ కీ సహా కీలక హెల్త్ ట్రాకర్లు..!!
- Lifestyle ఎండాకాలంలో ఈ ఫుడ్స్కు దూరంగా ఉండాలి.. లేదంటే డీహైడ్రేషన్ తప్పదు..
- Movies Tenent Review: మర్డర్ మిస్టరీ మెప్పించిందా? సత్యం రాజేష్కు హిట్ పడిందా? టెనెంట్ రివ్యూ
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
నవంబర్ 28న ట్రైయంప్ ఇండియా కార్యకలాపాలు షురూ..
బ్రిటీష్ మోటార్సైకిల్ కంపెనీ 'ట్రైయంప్' ఈనెలలో భారత మార్కెట్లో కార్యకలాపాలు నిర్వహించనున్నట్లు తెలుగు డ్రైవ్స్పార్క్ ఇదివరకటి కథనంలో ప్రచురించిన సంగతి తెలిసినదే. తాజా అప్డేట్ ప్రకారం, ట్రైయంప్ భారత్లో తమ వ్యాపారాన్ని ప్రారంభించేందుకు తేదీని ఖరారు చేసింది. నవంబర్ 28, 2013న దేశీయ విపణిలో కొత్త ఉత్పత్తులను విడుదల చేయటం ద్వారా తమ ప్రయాణం ప్రారంభిస్తామని కంపెనీ తెలిపింది.
గడచిన సంవత్సరం జనవరి నెలలో జరిగిన 2012 ఢిల్లీ ఆటో ఎక్స్పోలో ట్రైయంప్ తమ ప్రీమియం బైక్లను ప్రదర్శనకు ఉంచింది. వాస్తవానికి అదే సంవత్సరంలో భారత్లో కార్యకాలాపాలు ప్రారంభించాల్సి ఉన్నప్పటికీ, వివిధ కారణాల వల్ల (అంతర్గత కారణాలు) జాప్యం జరిగింది. ట్రైయంప్ ఇండియా విభాగానికి విమల్ సంబ్లీని మేనేజింగ్ డైరెక్టర్గా బాధ్యతలు నిర్వర్తించనున్నారు.
మరిన్ని
వివరాలను
క్రింది
ఫొటో
ఫీచర్లో
పరిశీలించండి.
ట్రైయంప్ ఇండియా ఇప్పటికే తమ ఉత్పత్తులను సికెడి (కంప్లీట్లీ నాక్డ్ డౌన్) రూట్లో విడిభాగాలుగా భారత్కు దిగుమతి చేసుకొని హర్యానాలోని మానేసర్ వద్ద ఏర్పాటు చేస్తున్న (ప్రస్తుతం ఈ ప్లాంట్ తుది దశలో ఉంది) అసెంబ్లింగ్ యూనిట్లో ఉత్పత్తి చేస్తున్నారు.
మానేసర్లో అసెంబ్లిగ్ యూనిట్
ట్రైయంప్ ఇండియా ప్రస్తుతం మానేసర్లో ఓ అసెంబ్లింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తోంది. ప్రస్తుతం ఈ ప్లాంటు నిర్మాణం తుది దశలో ఉంది. విడిభాగాలుగా దిగుమతి చేసుకున్న వాటికి ఇక్కడే అసెంబ్లింగ్ చేయనున్నారు.
కర్ణాటకలో మరొక ప్లాంట్
కర్ణాటక రాజధానికి బెంగుళూరుకు శివార్లలోని నర్సాపూర్ వద్ద కూడా ట్రైయంప్ ఓ ప్లాంటును ఏర్పాటు చేస్తోంది. అయితే, ఇది పూర్తి స్థాయిలో అందుబాటులోకి రావటానికి మరికొంత సమయం పట్టే ఆస్కారం ఉంది.
డీలర్షిప్ కేంద్రాలు
ట్రైయంప్ తొలుత ముంబై, ఢిల్లీ, బెంగుళూరు నగరాల్లో తమ అధీకృత డీలర్షిప్ కేంద్రాలను ప్రారంభించనుంది. అనంతరం తమ నెట్వర్క్ను అహ్మదాబాద్, ఛండీఘడ్, జైపూర్, చెన్నై, హైదరాబాద్, కొచ్చిన్ మరియు గోవా నగరాలకు విస్తరించనుంది.
కాంపిటీషన్
ట్రైయంప్ ఎక్కువగా నేక్డ్ బైక్లను ఆఫర్ చేస్తుంది. ఇవి నేరుగా హ్యార్లీ డేవిడ్సన్ వంటి ప్రీమియం బైక్లతో పోటీ పడనున్నాయి.