Just In
- 43 min ago ముంబయి- అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ కోసం ‘బాలస్ట్లెస్' ట్రాక్.. దీని ప్రత్యేకతలు తెలుసా.??
- 2 hrs ago కొత్త స్కూటర్ కొనేవారికి గుడ్ న్యూస్.. ఏథర్ రిజ్టా ప్రీ బుకింగ్లు ప్రారంభం.. రూ. 999 చెల్లిస్తే చాలు
- 4 hrs ago రూ. 10 లక్షల ధరలో టాటా నెక్సాన్ AMT కొత్త వేరియంట్లు విడుదల.. వివరాలివే.!!
- 4 hrs ago కూతురిపై ప్రేమ - కోట్ల రూపాయల కారు గిఫ్ట్ ఇచ్చిన తండ్రి (వీడియో)
Don't Miss
- News సీఎం పదవి ఊడిపోతుంది, మేము కొట్లాడుకుంటే మీ పార్టీ అధికారంలోకి వచ్చింది, ఈగనోడి !
- Lifestyle సమ్మర్ బ్లాక్ బస్టర్ రిసిపి మ్యాంగో చికెన్ కర్రీ..!ఒక్కసారి రుచి చూస్తే మళ్లీ మళ్లీ తినాలనిపిస్తుంది
- Finance Amitabh Kant: 2047 నాటికి 35 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా భారత్..
- Sports తలతిక్క నిర్ణయాలు: ఆ టీమ్కు అసలు సెన్స్ ఉందా: మాజీ లెజెండ్ ఫైర్
- Movies Yuva Movie Collections పునీత్ రాజ్కుమార్ ఫ్యామిలీ నుంచి మరో హీరో.. యువ మూవీకి రికార్డు కలెక్షన్లు
- Travel గుడ్ప్రైడే రోజున లాంగ్వీకెండ్ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ ప్లేస్లు చూసేయండి...
- Technology వాట్సాప్ కాలింగ్ ఫీచర్ వినియోగిస్తున్నారా.. అయితే ఈ అప్డేట్ మీకోసమే..!!
రోడ్ సేఫ్టీ ప్రమోషన్ కోసం యమహా బ్రాండ్ మస్కట్ విడుదల
ఎప్పుడూ రొటీన్గా మోటార్సైకిళ్లు, స్కూటర్లను ఏం విడుదల చేస్తాంలే అనుకుందో ఏమో, జపనీస్ మోటార్సైకిల్ బ్రాండ్ యమహా ఈసారి కొంచెం కొత్తగా ఓ వినూత్న ప్రచారానికి తెరలేపింది. జనవరిలో కొత్త ఉత్పత్తిని విడుదల చేస్తామని ప్రకటించిన యమహా, తమ కొత్త బ్రాండ్ మస్కట్ను విడుదదల చేసింది.
రహదారి ప్రయాణ భద్రతపై చిన్నారులలో ఆసక్తిని రేకెత్తించడంతో పాటుగా వారి తల్లిదండ్రులను కూడా చైతన్య పరచేందుకు మొట్టమొదటిసారిగా 'యమహా చిల్డ్రన్ సేఫ్టీ ప్రోగ్రామ్'ను నిర్వహిస్తున్నట్లు యమహా మోటార్ ఇండియా సేల్స్ (వైఎమ్ఐఎస్) ఓ ప్రకటనలో వెల్లడించంది. ఈ కార్యక్రమ ప్రచారం కోసమే తమ బ్రాండ్ మస్కట్ను ఆవిష్కరించినట్లు కంపెనీ పేర్కొంది.
యమహా తమ బ్రాండ్ మస్కట్కు ఇంకా ఎలాంటి పేరును పెట్టలేదు. దీనికి పేరు పెట్టేందుకు గాను ఈ నెల 27 వరకు బాలల కోసం ఓ ప్రత్యేక పోటీని నిర్వహించనున్నామని కంపెనీ పేర్కొంది. ఈ పోటీలో పాల్గొనదలచిన 5 నుంచి 12 ఏళ్ల లోపు బాలలు తమ తల్లిదండ్రుల సాయంతో సమీపంలోని యమహా డీలర్ల వద్ద పేర్లను నమోదు చేసుకోవాల్సి ఉంటుందని, ఇందులో గెలుపొందిన విజేతల వివరాలను ఫిబ్రవరి 5న వెల్లడిస్తామని కంపెనీ తెలిపింది. ఈ పోటీలో గెలుపొందిన వారికి స్కాలర్షిప్తో పాటుగా, వివిధ ఆకర్షనీయమైన బహుమతులను అందజేస్తారు.
ఈ చిల్డ్రన్ సేఫ్టీ ప్రోగ్రామ్ కోసం యమహా 12 మంది ట్రైనర్లను నియమించింది. వీరంతా జపాన్లోని యమహా మోటార్ కంపెనీలో ప్రత్యేక శిక్షణ పొందిన వారు. ఈ కార్యక్రమంలో భాగంగా, యమహా బ్రాండ్ మస్కట్ చిన్న పిల్లల స్కూళ్లను సందర్శిస్తుంది. ఈ సందర్భంగా, యమహా ప్రత్యేక హెల్మెట్లను కూడా విడుదల చేసింది.