ఢిల్లీ ఆటో ఎక్స్పోలో 200సీసీ కెటిఎమ్ డ్యూక్ బైక్ విడుదల

"వచ్చే ఏడాది ఢిల్లీ ఆటో ఎక్స్పో జరిగే సమయంలో తొలి 200 సీసీ డ్యూక్ బైక్ను భారత్లో విడుదల చేస్తామ"ని క్రాస్ ఇండస్ట్రీస్ ఏజి మరియు కెటిఎమ్ స్పోర్ట్మోటార్సాకిల్స్ ఏజి సంస్థలకు సీఈఓ అయిన స్టెఫన్ పీరెర్ వెల్లడించారు.
బజాజ్ ఆటో కంపెనీలోని పూణే ఉత్పత్తి కేంద్రంలో ఈ బైక్ను తయారు చేయనున్నట్లు ఆయన తెలిపారు. భారత్లో కంపెనీ విక్రయాల లక్ష్యం గురించి పీరెర్ మాట్లాడతూ... "బైక్ విడుదల చేసిన మొదటి సంవత్సరంలో 25,000 నుంచి 30,000 యూనిట్లను విక్రయించగలమని అంచనా వేస్తున్నాం. ఒక్క ఏడాది తర్వాత భారత్లో 350 సీసీ డ్యూక్ను విడుదల చేస్తామ"ని చెప్పారు.
గడచిన మార్చి నెలలో యూరప్లో విడుదల చేసిన డ్యూక్ బైక్ను ఇప్పటి వరకూ దాదాపు 7,000 యూనిట్లను విక్రయించామని, అక్కడ ఈ ఏడాది 10,000 యూనిట్లను విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ఆయన తెలిపారు. ఇరు సంస్థలు కూడా ప్రపంచ వ్యాప్తంగా తమ బైక్ మార్కెట్ పరిమాణాన్ని పెంచుకునే అంశంపై దృష్టి సారించాయి.
భారత్లో తాము తయారు చేసే అన్ని బైక్లు కూడా ప్రపంచ మార్కెట్లకు అనువుగా రూపొందిస్తున్న గ్లోబల్ మోడళ్లని, బజాజ్ ప్లాంటులో తయారయ్యే కెటిఎమ్ బైక్లు థాయ్లాండ్, మలేషియా, బ్రెజిల్ వంటి ఎదుగుతున్న మార్కెట్లకు ఎగుమతి చేయనున్నామని పీరెర్ చెప్పారు. గతేడాది(2010)లో కెటిఎమ్ 62,000 యూనిట్లను విక్రయించింది. ఈ ఏడాది 82,000 యూనిట్లను విక్రయించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుందని ఆయన తెలిపారు.


Click it and Unblock the Notifications








