సిగ్గు.. సిగ్గు..: ఆటో ఎక్స్పోలో అన్నీ అవకతవకలే!
ఆటో ఎక్స్పో జరుగుతున్న ప్రగతి మైదాన్లో సరైన మౌలిక సదుపాయాలు లేని కారణంగా ఎగ్జిబిటర్లు, కార్పోరేట్లు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కుంటున్నారు. దీనికితోడు సందర్శకుల తాకిడి కూడా అధికంగా ఉండటం నిర్వాహకులకు మరొక తలనొప్పిగా మారింది. విదేశీయ మీడియా ప్రతినిధులు సైతం తమ బ్యాడ్జ్ల కోసం రోజంతా వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది.
గతంలో నిర్వహణా కార్యకలాపాలను స్వయంగా నిర్వహించిన సిఐఐ, ప్రస్తుతం ప్రదర్శనను వేరొక పిఆర్ సంస్థకు అప్పజెప్పింది. అయితే, సదరు పిఆర్ సంస్థ ఆశించిన రీతిలో పనితీరును కనబరచకపోవడంతో చివరకు అసంతృప్తే మిగిలింది. ప్రపంచంలోనే అతిపెద్ద ఆటోమొబైల్ ప్రదర్శన అయిన ఢిల్లీ ఆటో ఎక్స్పో పట్ల నిర్వాహకుల వైఖరి నిరాశను మిగిల్చింది.
దీంతో రానున్న 2014లో జరగబోయే ఢిల్లీ ఆటో ఎక్స్పోను నగర శివార్లలోని నోయిడాలో ఏర్పాటు చేయాలని కమిటీ యోచిస్తోంది. ఇటీవలే భారత్లో తొలి గ్రాండ్ ప్రి జరిగిన బుధ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో 2014 ఆటో ఎక్స్పో నిర్వహించనున్నామని నిర్వహణ కమిటీ ఛైర్మన్ రాజీవ్ కౌల్ చెప్పారు.


Click it and Unblock the Notifications









