ఢిల్లీ ఆటో ఎక్స్పోలో సరికొత్త యమహా స్కూటర్లు
జపాన్కు చెందిన ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ యమహా మోటార్ ఇండియా, గతంలో చెప్పినట్లుగానే నాలుగు సరికొత్త స్కూటర్లను దేశీయ మార్కెట్కు పరిచయం చేసింది. మియో, ఫినో జెనాన్ అనే మూడు స్కూటర్లతో పాటుగా మరో కాన్సెప్ట్ స్కూటర్ను యమహా మోటార్ ఇండియా భారతీయ మార్కెట్లో ఆవిష్కరించింది. న్యూఢిల్లీలో జరుగుతున్న 11వ అంతర్జాతీయ ఆటో ఎక్స్పోలో కంపెనీ ఈ మోడళ్లను ప్రదర్శనకు ఉంచింది.

ఈ కార్యక్రమానికి బాలీవుడ్ సుందరాంగుడు జాన్ అబ్రహామ్, మిస్ ఇండియా వరల్డ్ కనిష్తా ధనకర్ తదితర ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా జాన్ అబ్రహామ్ ప్రసంగిస్తూ, యమహా బైక్లతో తనకు ఉన్న అనుబంధాన్ని విలేఖరులతో పంచుకున్నారు. ప్రస్తుతం యమహా బ్రాండ్కు జాన్ అబ్రహామ్ బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications








