సరికొత్త 2012 సొనాటాను విడుదల చేసిన హ్యుందాయ్
భారతదేశపు ద్వితీయ అగ్రగామి కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్ మోటార్ ఇండియా సరికొత్త అప్గ్రేడెడ్ సెడాన్ హ్యుందాయ్ సొనాటాను విడుదల చేసింది. న్యూఢిల్లీలో జరుగుతున్న 11వ అంతర్జాతీయ ఢిల్లీ ఆటో ఎక్స్పోలో కంపెనీ ఈ కారును విడుదల చేసింది. ఇందులో సరికొత్త 2.4 లీటర్ జిడిఐ ఇంజన్ను ఉపయోగించారు. ప్రస్తుతం హ్యుందాయ్ విడుదల చేసిన సొనాటా సెడాన్ ఆరవ తరానికి చెందినది.

కొత్త 2012 హ్యుందాయ్ సొనాటా సెడాన్లో ఫ్రంట్ అండ్ రియర్ వెంటిలేషన్, అధిక కాంతినిచ్చే జెనాన్ హెడ్ల్యాంప్స్, క్రూయజ్ కంట్రోల్, పెడల్ షిఫ్ట్, 10-రకాలుగా అడ్జస్ట్ (10-వే అడ్జస్టబుల్ సీట్) చేసుకునే విధంగా అమర్చిన డ్రైవర్ పవర్ సీట్, 4-వే అడ్జస్టబుల్ ఫ్రంట్ ప్యాసింజర్ సీట్ వంటి సదుపాయాలు ఉన్నాయి. కొత్త సొనాటా ఫ్లూయిడిక్ డిజైన్ కాన్సెప్ట్ను పాటిస్తూ మమచి స్పోర్టీ లుక్ని ఇస్తుంది.
హ్యుందాయ్ తాజాగా విడుదల చేసిన ఎకో-ఫ్రెండ్లీ సొనాటాలో 6 ఎయిర్బ్యాగ్స్, ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ (ఈబిడి)తో కూడిన యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ఏబిఎస్), ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ (ఈఎస్పి), రియర్ వ్యూ కెమెరా, పుష్ బటన్ స్టార్ట్తో కూడిన స్మార్ట్ కీ వంటి అత్యాధునిక సాంకేతిక మరియు భద్రతా ఫీచర్లు కూడా ఉన్నాయి.


Click it and Unblock the Notifications








