ఆటో ఎక్స్పోలో ఎక్స్ఎల్1 కాన్సెప్ట్ను ప్రదర్శించిన ఫోక్స్వ్యాగన్
గడచిన సంవత్సరం జనవరి నెలలో జరిగిన ఖతార్ మోటార్ షోలో జర్మన్ ఆటో దిగ్గజం ఫోక్స్వ్యాగన్ ప్రదర్శించిన "ఎక్స్ఎల్ 1" హైబ్రిడ్ కారును కంపెనీ భారత్కు తీసుకువచ్చింది. దేశ రాజధాని న్యూఢిల్లీలో జరుగుతున్న 11వ అంతర్జాతీయ ఆటో ఎక్స్పోలో ఫోక్స్వ్యాగన్ తమ ఎక్స్ఎల్ 1 కాన్సెప్ట్ కారును ఆవిష్కరించింది.
ఇది లీటరు డీజిల్కు 100 కి.మీ. మైలేజీనిస్తుందని కంపెనీ పేర్కొంది. ఫోక్స్వ్యాగన్ జర్మన్ ఇంజనీర్లు 12 ఏళ్ల పాటు పరిశోధన చేసి ఎక్స్ఎల్ 1 కారుకు రూపకల్పన చేశారు. 2002లో ఈ కారు తయారీకి శ్రీకారం చుట్టారు. ఇందులో ఇద్దరికి మాత్రమే చోటు ఉంటుంది. ఇది డీజిల్ ప్లస్ బ్యాటరీ పవర్తో నడుస్తుంది. దీని గరిష్ఠ వేగం గంటకు 99 మైళ్లు.
ఈ కారు తక్కువ బరువు ఉండే విధంగా దీనిని కార్బన్ ఫైబర్తో రూపొందించారు. ఫోక్స్వ్యాగన్ ఎక్స్ఎల్ 1లో 47 హెచ్పి, 800 సీసీ, 2-సిలిండర్ టర్బో డీజిల్ డిడిఐ ఇంజన్తో పాటు 27 హెచ్పి సామర్థ్యం కలిగిన ఎలక్ట్రిక్ మోటార్ కూడా ఉంటుంది. కేవలం బ్యాటరీ పవర్తోనే ఇది 22 మైళ్ల దూరం ప్రయాణించగలదు.


Click it and Unblock the Notifications









