మారుతీ సుజుకి తొలి ప్రీమియర్ సేదన్ 'సుజుకి కిజాషి'..!!

By

Suzuki Kizashi
భారతీయ ఆటోమొబైల్ కంపెనీ మారుతీ సుజుకి చిన్న కార్లను రూపొందించడంలో పేరొందినది. ఈ కంపెనీ నుండీ వచ్చిన మారుతీ 800, మారుతీ జెన్ కార్ల నుండీ ఇటీవలే విడుదలయిన స్విఫ్ట్ వరకూ అన్నీ చిన్న కార్లే. ఈ చిన్న కార్ల కంపెనీ త్వరలో ఓ ప్రీమియం సేదన్ కారును భారతీయ విపణిలోకి విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది.

ఇంతకు ముందు మారుతీ సుజుకి స్విఫ్ట్ ఢిజైర్ అనే సేదన్ ను విడుదల చేసి విజయవంతం అయిన మారుతీ సుజుకి ఇప్పుడు ఈ ప్రీమియర్ సేదన్ కారును కూడా విజయవంతం చెయ్యాలని ప్రయత్నిస్తోంది. 'సుజుకి కిజాషి' పేరుతో రూపుదిద్దుకున్న ఈ ప్రీమియర్ సేదన్ ను వచ్చే ఏడాది ఢిల్లీలో జరిగే ఆటో ఎక్స్-పో లో ప్రదర్శించడానికి మారుతి సుజుకి సన్నాహాలు చేస్తోంది.

జపాన్, అమెరికా వంటి దేశాలలో ఇప్పటికే విడుదలయిన ఈ కారు 2.4 లీటర్ DOHC ఇన్ లైన్ ఫోర్ సిలిండర్ ఇంజన్ తో రూపొంది, 180 హార్స్ పవర్ తో దూసుకుపోనుంది. కాగా ఈ ప్రీమియర్ సేదన్ కారు ధర సుమారు 15 లక్షల వరకూ ఉంటుందని సమాచారం.

Most Read Articles

Story first published: Wednesday, December 16, 2009, 17:28 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X