న్టూ ఢిల్లీ ఆటో షోలో సందడి చేసిన చిన్న కార్లు, హైబ్రిడ్ కార్లు..!!

టయోటా, హోండా, సుజుకి, జనరల్ మోటార్స్, ఫోర్డ్, వోక్స్ వ్యాగన్ ఇలా అన్ని అంతర్జాతీయ కంపెనీలు చిన్న కార్ల పాటే పాడాయి. ఇక గత దశాబ్దంలో ఎలక్ట్రిక్ కార్లను మొహం చిట్లించిన కంపెనీలు ఇప్పుడు మారిన పరిస్థితుల దృష్ట్యా ఎలక్ట్రిక్ కార్లను రూపొందించేందుకు ఆశక్తిని చూపించాయి.
తొలుత మారుతీ సుజుకి విషయానికి వస్తే ఈ ఆటో షోలో ఈ కంపెనీ మారుతీ ఆర్-3 మరియు మారుతు కిజాషి వాహనాలను ప్రదర్శనకు తీసపకపకొచ్చింది. ఇందులో కిజాషీ వీక్షకులను విశేషంగా కట్టకుంది. ఆ తర్వాత టయోటా కంపెనీ ను భారతదేశం కోసమే ప్రత్యేకంగా రూపొందించిది. టయోటా ఎతియోస్ పేరుతో విడుదలవున్న ఈ కారు 2011 లోమార్కెట్లోకి విడుదల కానుంది.
ఆ తర్వాత హోండా మోటార్స్ రూపొందించిన చిన్న కారు. ఈ కారు 5 లక్షల ధర పలుకనున్నట్టు సమాచారం. ఆ తర్లాత వోక్స్ వ్యాగన్ సంస్థ రూపొందించిన చిన్నకారు పోలొ ను కూడ ఇక్కడ పదర్షించారు. యూరోపియన్ కార్ ఆఫ్ ది ఇయర్ అవార్డు గెలిచిన ఈ కారు ఇక్కడి నీక్షకులను విశేషంగా ఆకర్షించింది.


Click it and Unblock the Notifications








