వినియోగదారుడి ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఆటోసంస్థలు..!!

ముఖ్యంగా టయోటా మోటార్స్ వారి కార్లులో తలెత్తిన ఆగ్జిలేటర్ సమస్యల తరహా సమస్యలతో ఇప్పటి వరకూ 19 మంది మృత్యువాత పడ్డారంటే సదురు సంస్థలు వినియోగదారుడి భద్రతతో ఏ రేంజిలో ఆడుకుంటున్నారో అర్థం చేసుకోవచ్చు. కార్లు కొనేప్పుడు లక్షలకు లక్షలు వసూలు చేసే సంస్థలు వారి జాగ్రత్తపై తీసుకునే చర్యలు మాత్రం గాలిలో దీపం వలే వున్నాయి. ఇప్పటికే అమెరికాలో టయోటా సంస్థ అమ్మకాలు ఘననీయంగా పడిపోయాయి. సంస్థ మీద కోర్టులో వాజ్యం కూడా నమోదయింది. ప్రభుత్వం ఇలాంటి సంస్థలపై కఠిన వైఖరిని అవలంబించాలని వారు కోరుతున్నారు...కాబట్టి వినియోగదారుడా జరభద్రం...!!


Click it and Unblock the Notifications








