లక్ష ట్రాక్టర్ల అమ్మకాలతో చరిత్ర సృష్టించిన మహీంద్రా ట్రాక్టర్లు..!!

By

Tractors
భారతదేశానికి చెందిన ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా ఈ ఏడాది ట్రాక్టర్ అమ్మకాల్లో రికార్డు స్థాయిలో అమ్మకాలు జరిపి చరిత్రను సృష్టించింది. ఒక్క ఏడాదిలోనే లక్ష ట్రాక్టర్లను అమ్మి ఇప్పటి వరకూ ఏ ఆటోమొబైల్ సంస్థ సృష్టించనటువంటి అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. గత ఏడాది 80,000 ట్రాక్టర్లను అమ్మిన మహీంద్ర సంస్థ వచ్చే మార్చి నెలలోపు 1,70,000 ట్రాక్టర్లను అమ్మాలని నిర్ణయించుకుంటున్నట్టు, ఈ టార్గెట్ ను అందుకొనే దిశగా సంస్థ ప్రయత్నాలు మొదలెట్టిందని సంస్థ వర్గాల సమాచారం.

ఈ సందర్భంగా మహీంద్రా సంస్థ ప్రెసిడెంట్ అంజనీ కుమార్ మాట్లాడుతూ లక్ష అమ్మకాల మైలురాయిని చేరుకోవడం మరపురానిది. రాబోయే కాలంలో మరింత అభివృద్ధి చెందేందుకు ప్రయత్నిస్తామని చెప్పారు.

Most Read Articles

Story first published: Monday, February 22, 2010, 14:58 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X