ఈ ఏడాది అత్యధిక అమ్మకాలు జరిపిన ఆటోమొబైల్ సంస్థగా ప్రారంభమయిన మారుతీ సుజుకీ ప్రస్థానం త్వరలో విడుదలవనున్న లగ్జరీ కారు కిజాషీతో మరిత శోభాయమానం కానుంది. 2.4 లీటర్ యూర్-IV ఇంజిన్ తో రూపొందిన ఈ కారు జపాన్ మార్కెట్ లో ఇప్పటికే సంచలనాలు నమోదుచేసింది. ఈ కారు అతి త్వరలో భారతీయ మార్కెట్ లోకి విడుదల కానుంది కంపెనీ వర్గాల సమాచారం. గత నెల ఢిల్లీలో జరిగిన ఆటో షోలో ఈ కారుకు వీక్షకులనుండీ మంచి స్పందన లభించిన సంగతి తెలిసిందే.
10 నుండీ 13 లక్షల మధ్య ధర పలికే ఈ కారు తప్పకుండా ప్రజాదరణ పొందుతుందని, ప్రస్తుంతం మార్కెట్ లో వున్న టయోటా, హోండా లాంటి సంస్థల కార్లు సివిక్, సొనాట్, స్కోడా లాంటి కార్లకు గట్టిపోటీని ఇస్తుందనే నమ్మకం వుందని సంస్థ వర్గాలు ప్రకటించాయి.