14 నెలల్లో 1,00,000 ఇంజన్లను ఉత్పత్తి చేసిన ఫోర్డ్ ఇండియా

ఈ ప్లాంటును ఏటా 2,50,000 ఇంజన్లను ఉత్పత్తి చేసే సామర్థ్యంతో ఏర్పాటు చేశారు. అభివృద్ధి చెందుతున్న భారత వాహన మార్కెట్ మరియు ఎగుమతుల అవసరాలకు అనుగుణంగా ఈ ప్లాంటును రూపొందించినట్లు ఫోర్డ్ ఇండియా పేర్కొంది. ఈ సందర్భంగా ఫోర్డ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ మైఖేల్ బోన్హామ్ మాట్లాడుతూ.. ఈ ప్రపంచ-స్థాయి ఉత్పత్తి కేంద్రం ద్వారా తమ నాణ్యమైన ఉత్పత్తులతో అన్ని విభాగాల్లోనూ గట్టి పోటీ ఇవ్వగలమని చెప్పారు. కాగా.. తర్వాతి లక్ష ఇంజన్లను ఇంత కన్నా తక్కువ సమయంలోనే పూర్తి చేయగలమని ఫోర్డ్ ఇండియా వైస్-ప్రెసిడెంట్, పవర్ట్రైన్ ఆపరేషన్స్ (పిటిఓ) రాధాక్రిష్ణన్ బాలసుందరం చెప్పారు.
చెన్నయ్లో ఏర్పాటు చేసిన ఇంజన్ ప్లాంట్ ఫోర్డ్ తొలి ఉత్పత్తి కేంద్రం కావడం విశేషం. ఈ ప్లాంటులో పెట్రోల్, డీజిల్ ఇంజన్లను ఫోర్డ్ ఉత్పత్తి చేస్తుంది. ఫోర్డ్ వాహనాల కోసం ఐదు రకాల డ్యురాటెక్ పెట్రోల్ ఇంజన్లను, ఒక డ్యురాటార్క్ డీజిల్ ఇంజన్ల కంపెనీ ఉత్పత్తి చేస్తుంది. ఈ ప్లాంటులో ఉత్పత్తి చేసిన ఇంజన్లలో ఇప్పటి వరకూ మూడొంతులకు పైగా ఇంజన్లు దక్షిణాఫ్రికా, థాయ్లాండ్ దేశాలకు ఎగుమతి అయినట్లు కంపెనీ తెలిపింది.


Click it and Unblock the Notifications








