లీటరుకు 49.3 కి.మీ. మైలేజీనిచ్చిన మారుతి ఆల్టో

కలకత్తాలో మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ నిర్వహించిన "ఆల్టో ఎక్స్ప్లోర్ మ్యాక్స్ మైలేజ్ ర్యాలీ"లో పాల్గొన్న దిలీప్ దాస్ తన ఆల్టో కారుతో లీటరుకు 49.3 కి.మీ. మైలేజీని సాధించి విజేతగా నిలిచాడు. ఆల్టో/ఆల్టో కె-10 యజమానులతో కంపెనీ ఈ ర్యాలీని నిర్వహించింది. ఆ తర్వాత బెస్ట్ మైలేజ్ 48.2 కి.మీ.గా నమోదైంది.
హైదరాబాద్కు చెందిన మెహ్ది హాసన్ ఈ మైలేజ్ను సాధించాడు. బెస్ట్ మైలేజ్లో మళ్లీ మూడవ స్థానంలో కూడా హైదరాబాద్కు చెందిన పి సాయి సుమంత్ 47.6 కి.మీ. సాధించాడు. తమ ఆల్టో కార్ల నుండి గరిష్ట మైలేజ్ను ఎలా పొందాలో తెలిపే డ్రైవింగ్ అలవాట్ల పట్ల వాహన యజమానుల్లో అవగాహనను పెంచేందుకు మారుతి సుజుకి ఈ "ఆల్టో ఎక్స్ప్లోర్ మ్యాక్స్ మైలేజ్ ర్యాలీ"ని నిర్వహిస్తుంది.


Click it and Unblock the Notifications








