డీజిల్ వాహనాలపై ఎక్కువ ఎక్సైజ్ పన్ను వద్దు: పటేల్

గతంలో ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం కారణంగా డీజిల్ కార్లపై ఎక్కువగా ఎక్సైజ్ సుంకాన్ని చెల్లించాల్సి వస్తుంది. అయితే, యూరప్, అమెరికా, జపాన్ వంటి దేశాలలో డీజిల్ వాహనాలకే పెద్ద పీట వేస్తున్నారని, కానీ మనం దేశంలో మాత్రం డీజిల్ వాహనాలకు ప్రోత్సాహం అంతంత మాత్రంగానే ఉందని ఆయన తన లేఖలో పేర్కొన్నారు. ఇంధన వాడకాన్ని తగ్గించేందుకు అవసరమయ్యే అత్యాధునిక సాంకేతి పరిజ్ఞానం యొక్క అవసరం మనకు ఎంతైనా ఉందని ఆయన తెలిపారు.
గతంలో మన దేశంలో డీజిల్ కార్లకు ఆదరణ అంతంత మాత్రంగానే ఉండేది. ఇందుకు ప్రధాన కారణం, వీటి మెయింటినెన్స్ అధికంగా ఉండటమే. అయితే, ప్రస్తుతం అందుబాటులోకి సిఆర్డిఐ వంటి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాల కారణంగా ప్రస్తుతం దేశంలో డీజిల్ కార్ల వాడకం విరివిగా పెరిగింది. డీజిల్ కార్లకు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో, ఈ మోడళ్లపై గతంలో విధించిన అధనపు సుంకాన్ని పూర్తిగా తొలగించాలనేది ప్రఫుల్ పటేల్ వాదన.


Click it and Unblock the Notifications








