హైబ్రిడ్ వెర్షన్ ట్రావెలర్ను లాంచ్ చేయనున్న ఫోర్స్ మోటార్స్
వచ్చే ఏడాది చివరి నాటికి ఈ హైబ్రిడ్ ట్రావెలర్ను వాణిజ్య పరంగా మార్కెట్లోకి విడుదల చేస్తామని కంపెనీ తెలిపింది. అంతేకాకుండా, 2012 ఢిల్లీ ఆటో ఎక్స్పోలో సిఎన్జీ వేరియంట్ ట్రావెలర్ను అలాగే, ప్రస్తుతం జర్మన్ ఆటో దిగ్గజం డైమ్లర్ లైసెన్స్తో అభివృద్ధి చేస్తున్న ఓ 9-సీటర్ మల్టీ పర్పస్ వాహనాన్ని (ఎమ్పివి)ని కూడా విడుదల చేయనున్నామని ఫోర్స్ మోటార్స్ వెల్లడించింది. దీని ధర రూ. 12.15 లక్షల మధ్యలో ఉండనుంది.
ఈ విషయంపై ఫోర్స్ మోటార్స్ మేనేజింగ్ డైరెక్టర్ ప్రసన్ ఫిరోడియా స్పందిస్తూ.. "జనవరిలో జరగనున్న ఢిల్లీ ఆటో ఎక్స్పోలో మేము ఓ హైబ్రిడ్ ట్రావెలర్ కాన్సెప్ట్ను ప్రదర్శించనున్నాం. ఇది సోలార్ ఎనర్జీతో పాటుగా పునరుత్పాక ఎగ్జాస్ట్ సిస్టమ్ల ద్వారా పనిచేస్తుంది. ఏడాది తర్వాత ఈ మోడల్ను వాణిజ్యపరంగా విడుదల చేస్తాం. దీన్ని మధ్యప్రదేశ్లోని పీతాంపూర్ ప్లాంటులో ఉత్పత్తి చేస్తామ"ని ఆయన తెలిపారు.


Click it and Unblock the Notifications









