జనవరిలో మూడు మినీ మోడళ్ల విడుదల: బిఎమ్డబ్ల్యూ

భారత్లో మినీ బ్రాండ్ కార్ల ధరలు, ప్రస్తుతం బిఎమ్డబ్ల్యూ అందిస్తున్న చవక మోడల్ ఎక్స్-1 (రూ.21 లక్షలు) రేంజ్లో ఉండనున్నాయి. మినీ బ్రాండ్ కార్లకు ప్రపంచ వ్యాప్తంగా ఎంతో క్రేజ్ ఉంది. వచ్చే జనవరిలో జరగనున్న ఢిల్లీ ఆటో ఎక్స్పోలో బిఎమ్డబ్ల్యూ ఈ మినీ కార్లను విడుదల చేయనుంది. ప్రస్తుతానికి వీటిని సిబియూ (కంప్లీట్లీ బిల్ట్ యూనిట్) రూట్ ద్వారా కంపెనీ దిగుమతి చేసుకోనుంది.
ఈ మూడు మోడళ్ల విడుదల తర్వాత వీటికి లభించే స్పందనను బట్టి, మినీ బ్రాండ్లో రూపొందుతున్న ఇతర మోడళ్లను కూడా భారత మార్కెట్లో ప్రవేశపెట్టాలని కంపెనీ యోచిస్తోంది. వాస్తవానికి 2009లోనే ఈ మినీ బ్రాండ్ కార్లను భారత్లో విడుదల కావాల్సి ఉన్నప్పటికీ, భారత మార్కెట్లో మినీ బ్రాండ్ కార్లకు ఉన్న సాధ్యాసాధ్యాలను పరిశీలించిన తర్వాత వీటిని ఇక్కడి మార్కెట్లోకి విడుదల చేయాలని కంపెనీ నిర్ణయించింది.


Click it and Unblock the Notifications








