పెట్రో కంపెనీలు కొత్త సంవత్సర కానుక: ధర పెంపు

Petrol Price Hike
కొత్త సంవత్సర కానుకగా పెట్రోల్ కంపెనీలు ఓ చేదు కానుకను వినియోగదాలకు బహుమతిగా ఇవ్వనున్నాయి. డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి మారకపు విలువ తక్కువగా ఉండటం వలన ముడుచమురు ధరలు పెరుగుతుండటంతో సదరు నష్టాన్ని ప్రజలపై మోపాలని పెట్రోల్ కంపెనీలు యోచిస్తున్నాయి. ఈ మేరకు జనవరి 2012లో పెట్రోల్ ధరలను రూ.1 మేర పెంచే అవకాశాలున్నాయి.

ప్రస్తుతం డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి మారకం రూ.52.70 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఈ నెల 15న కూడా చమురు కంపెనీలు పెట్రోల్ ధరలను 65 పైసలు పెంచిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం పెట్రోల్ ధరల నియంత్రణ ప్రభుత్వ రంగ చమురు సంస్థల అధీనంలో ఉన్నందున, నెలకు రెండుసార్లు చొప్పున (ప్రతి నెలా 1, 16 తేదీల్లో) ధరలను సమీక్షించి, పెంపు లేదా తగ్గింపుపై నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది.

ఇప్పటి మార్కెట్ పరిస్థితుల ప్రకారం, ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు ప్రతి లీటరు పెట్రోల్ విక్రయంపై 85 పైసలు చొప్పున నష్టపోతున్నాయి. ఈ నేపథ్యంలో జనవరి 1వ తేదీన సమావేశం కానున్న కంపెనీలు ధరల పెంపు వైపే మొగ్గు చూపే ఆస్కారం ఉంది. న్యూఢిల్లీలో ప్రస్తుతం లీటర్ పెట్రోల్ ధర రూ.65.64 (ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్)గా ఉంది.

More from DriveSpark

Article Published On: Monday, December 26, 2011, 10:23 [IST]
English summary
Petrol prices may be hiked by Rs. 1 per litre from January 2012 as the Indian currency has weakened against the US dollar making imports costlier.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+