రాజధానిలో 3,500 కొత్త ఆటోలకు గ్రీన్ సిగ్నల్ తెలిపిన సర్కార్

మొత్తం 3,500 కొత్త ఆటోలలో ఎస్సీ/ఎస్టీ వర్గాల కోసం 500 అభ్యర్థులకు అనుమతి ఇవ్వగా, మిగిలిన 3,000 ఆటో రిక్షాల అనుమతులను ఓపెన్ కేటగిరీ కింద అందుబాటులో ఉంచారు. ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియ వచ్చే ఏడాది జనవరి 31 జనవరి నాటికి పూర్తిచేయాలని ప్రభుత్వం ప్రకటించింది.
రవాణా సదుపాయం కోసం ప్రజలన కోరికను పరిగణలోకి తీసుకుని ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని తీసుకుంది. కొత్త ఆటో రిక్షాల చేరికతో రాష్ట్రంలో సంచరించనున్న మొత్తం ఆటో రిక్షాల సంఖ్య 73,535 యూనిట్ల నుండి 77,035 యూనిట్లకు పెరగనుంది.


Click it and Unblock the Notifications








