ఐదు కొత్త మోడళ్లను భారత్లో ప్రవేశపెట్టనున్న రీనాల్ట్

ఏడాదికి నాలుగు లక్షల యూనిట్లను ఉత్పత్తి చేయగలిగే సామర్థ్యంలో ఈ ప్లాంటును నిర్మించనున్నట్లు కంపెనీ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. రానున్న ఐదేళ్లపాటు వార్షికంగా 70,000 కార్లను విక్రయించాలనే లక్ష్యంతో ఉన్నామని రీనాల్ట్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ మార్క నాసిఫ్ పేర్కొన్నారు. ఈ ఐదు మోడళ్లలో మొదటి దానిని ఈ ఏడాది మధ్యభాగంలో విడుదల చేస్తామని, రష్యా, బ్రెజిల్ మార్కెట్ల మాదిరిగానే భారత మార్కెట్ కూడా తమకు ఎంతో పటిష్టమైనదని ఆయన తెలిపారు. ఈ మోడల్ తర్వాత హై-ఎండ్ కాంపాక్ట్ ఎస్యూవి కారు 'కొలియోస్'ను విడుదల చేయనున్నామని మార్కె పేర్కొన్నారు.


Click it and Unblock the Notifications








