మానేసర్ ప్లాంటు సమ్మెలో పాల్గొననున్న 65 యూనియన్లు

సమ్మె నేపథ్యంలో వర్కర్లకు యాజమాన్ని మధ్య సయోధ్య కుదిర్చేందుకు హర్యాన రాష్ట్ర కార్మిక మంత్రి శివ్ చరణ్ చేసిన ప్రయత్నాలు కూడా ఆశించిన ఫలితాలనివ్వలేదు. అయితే కంపెనీ మాత్రం తొలిగించిన ఉద్యోగులను తిరిగి వెనక్కు తీసుకునే అంశంపై మల్లగుల్లాలు పడుతోంది. వీరిలో కేవలం ఐదు మందిని మాత్రమే విధుల్లోకి చేర్చుకోవాలని కంపెనీ భావిస్తున్నట్లు సమాచారం. కానీ శ్రామికులు మాత్రం ఉద్యోగులందరీని విధుల్లోకి తీసుకొని, వారిపై ఎలాంటి క్రమశిక్షణ చర్యలు తీసుకోబోమని కంపెనీ తమకు రాతపూర్వకంగా తెలిపితేనే సమ్మె ముగిస్తామని చెబుతున్నారు. సమ్మె ఫలితంగా దేశపు అతిపెద్ద ప్యాసింజర్ కార్ల కంపెనీకు ఇప్పటివరకూ దాదాపు రూ. 400 కోట్లకుపైగా నష్టం వాటిళ్లినట్లు అంచనా.


Click it and Unblock the Notifications








