అశోక్ లేలాండ్-నిస్సాన్ల జేవీ నుంచి తొలి ఎల్సీవీ 'దోస్త్'

'దోస్త్' బ్రాండ్ పేరిట విడుదలైన ఈ వేరియంట్ బిఎస్-3, 4 వర్షన్లలో లభిస్తుందని తెలిపారు. ఈ జేవీ నుంచి తయారైన వాహనాలను విక్రయించడానికి త్వరలో 25 మంది ఎక్స్క్లూజివ్ డీలర్లను నియమించనున్నామని పేర్కొంది. అక్టోబర్ 2007లో అశోక్ లేలాండ్, నిస్సాన్ కంపెనీలు మాస్టర్-కోపరేషన్ అగ్రిమెంట్ ద్వారా జాయింట్ వెంచర్గా ఏర్పడ్డాయి. ఇందుకోసం ఇరు కంపెనీలు రూ. 2,300 కోట్లను పెట్టుబడులుగా వెచ్చించాయి. కాగా.. అశోక్ లేలాండ్ దోస్త్ వాహనం ఈ జేవీ నుంచి వస్తోన్న తొలి ఎల్సీవీ కావడం విశేషం.


Click it and Unblock the Notifications








