అమితాబ్, అంబానీలు మెచ్చిన కారు.. ఇకపై భారత్లో..!

ఈ ఏడాది ఏప్రిల్ నెలలో మాసేరటి ఓ మోడల్ను భారత్ మార్కెట్లో విడుదల చేసే అవకాశాలున్నాయి. ఫియట్ సంస్థకు చెందిన అనుబంధ కంపెనీ అయిన మాసేరటి భారత్లోని ఓ కంపెనీతో భాగస్వామ్యంగా ఏర్పడి తమ కార్లను దిగుమతి చేసి దేశీయ మార్కెట్లో విక్రయించనుంది. ఇటలీలోని మోడెనాలో మాసేరటి పరిమిత సంఖ్య (లిమిటెడ్ ఎడిషన్)లో కార్లను తయారు చేస్తుంది. వీటిని దాదాపు 75 విదేశీ మార్కెట్లకు కంపెనీ ఎగుమతి చేస్తుంది. భారత్లో మూడు మాసేరటి మోడళ్లు అందుబాటులోకి రానున్నాయి. రెండు సీట్లు కలిగిన గ్రాన్ కాబిరో ధర రూ. 5 కోట్లు, సెడాన్ మోడల్ కారు క్వాట్రోపోర్ట్ ప్రారంభ ధర రూ. 3 కోట్లు, టాప్ ఎండ్ స్పోర్ట్స్ వెర్షన్ కూప్ మోడల్ కారు గ్రాన్తురిస్మో ధర 4.75 కోట్లుగా ఉంది.


Click it and Unblock the Notifications








