ఆంధ్రప్రదేశ్ మార్కెట్లో ‘దోస్త్’ని ఆవిష్కరించిన అశోక్ లేలాండ్

ఇండియన్ ఖరీ దుకు జపాన్ సాంకేతిక పరిజ్ఞానంతో తయారైన వాహనం తో ఎల్సివి కస్టమర్కు అందించాలని తాము చేసిన ప్రయత్నంలో భాగంగా 'దోస్త్'ను విడుదల చేసినట్లు చెప్పారు. దోస్త్ 1.25 టన్నుల బరువును మోసుకుపోగల వాహనం మూడు వర్షన్లలో లభిస్తుందన్నారు. టాప్-ఎండ్ వర్షన్లో ఎయిర్ కండిషనింగ్, పవర్ సిస్టమ్, పవర్ స్టీరింగ్, డ్యూయల్ కలర్ బైగీ, గ్రేటి మ్, ఫ్యాబ్రిక్ సీట్స్ ప్రధాన ఆకర్షణలని తెలిపారు. ప్రపంచ స్థాయి నాణ్యతతో తయారైన 55 హెచ్పి, 3 సిలిండర్, 1.5 లీటర్ కామర్ రైల్ టిడిసిఆర్తో ఇది తయారైంది.
150 ఎస్ఎం టార్క్తో భారత్లోని రహదార్లకు అనుగుణంగా ఉంటూ ఇంధన పొదుపును పాటిస్తూ మంచి డ్రైవింగ్ అనుభూతిని అందించేలా దోస్త్ ఇంజన్ తయారైంది. వినియోగదారులు తమకు నచ్చిన రంగును ఎంచు కునేందుకు వీలుగా వైట్, బైగ్, బ్లూ కలర్లలో పాలెట్లు ఉన్నాయి. ఎల్సివి ఇండస్ట్రీలో తొలిసారిగా దోస్త్ ప్లాట్ఫాంను ఉపయోగించు కుంటూ రెడీ-టూ-యూజ్ వెహికల్స్ను ఆశోక్ లైలాండ్ ఆఫర్ చేయనుంది.


Click it and Unblock the Notifications








