భారత మార్కెట్లోకి మరో రెండు కార్లు విడుదల..!!

Audi
భారత ఆటోమొబైల్ మార్కెట్లోకి కొత్తగా మరో రెండు కార్లు ప్రవేశించాయి. జర్మనీకి చెందిన ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఆడి ఇండియా దేశీయ మార్కెట్లోకి "ఆడి ఆర్8" అనే మరో విలాసవంతమైన కారును ప్రవేశపెట్టింది. 4.2 ఎఫ్ఎస్ఐ పెట్రోల్ ఇంజన్ కలిగిన ఆడి ఆర్8 ధరలను రూ. 89 లక్షలుగా నిర్ణయించినట్లు కంపెనీ పేర్కొంది. లగ్జరీ కార్ల విభాగంలో ఆడి సరికొత్త మైలురాళ్లను అధిగమించగలదని కంపెనీ ఆశాభావం వ్యక్తం చేస్తుంది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఈ కారును రూపొందించామని, ఇందులోని ఇంటీరియర్ అత్యంత ఆకర్షణీయంగా ఉంటుందని కంపెనీ పేర్కొంది.

మరోవైపు దేశీయ ఆటోమొబైల్ సంస్థ టాటా మోటార్స్‌ ఇటీవల విడుదల చేసిన "టాటా మాంజా"కు సరికొత్త హంగులు అద్ది తాజాగా మార్కెట్లోకి విడుదల చేసింది. సరికొత్త ప్రీమియం డ్యూయల్‌‌టోన్‌ ఇంటీరియర్స్‌, ఎక్స్‌టీరియర్స్‌తో పాటు ఎయిర్‌బ్యాగ్స్‌, మల్టీస్టేజ్‌ డ్రైవ్‌, ఆటో లాకింగ్‌, రేర్‌ డెమిస్టర్‌, కొలాప్సిబుల్‌ స్టీరింగ్‌, ఎనర్జీ అబ్సార్బింగ్‌ స్టీరింగ్‌ వీల్‌, డోర్‌ ఇన్‌ట్రషన్‌ బీమ్‌ వంటి రక్షణాపరమైన జాగ్రత్తలతో లభిస్తుంది. పెట్రోల్‌ వేరియంట్‌లో లభించే మాంజా ధర రూ. 5.14 లక్షలు ఉండగా.. డీజిల్‌ వేరియంట్‌లో మాంజా ధర రూ. 5.91 లక్షలుగా ఉన్నట్లు కంపెనీ పేర్కొంది.

More from DriveSpark

Article Published On: Monday, February 7, 2011, 17:31 [IST]
English summary
The German luxury car maker Audi has just launched its new luxury sedan A8 L posing innovative standards in the segment. With long wheels, and new powerful 4.2 FSI petrol engine the car is at the New Delhi showroom on display at the price tag of Rs89 lakhs.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+