మే 2011 విక్రయాలలో రెండింతల వృద్ధిని సాధించిన ఆడి

ఫోక్స్వ్యాగన్ గ్రూపుకు చెందిన భారతీయ అనుబంధ సంస్థ ఆడి ఇండియా గత నెల విక్రయాలలో రెండితల వృద్ధిని సాధించి శభాష్ అనిపించుకుంది. మే 2011లో ఆడియా విక్రయాలు 104 శాతం వృద్ధి చెంది 408 వాహనాలను విక్రయించింది. గతేడాది ఇదే సమయంలో కంపెనీ విక్రయాలు కేవలం 200 యూనిట్లుగా మాత్రమే ఉన్నట్లు కంపెనీ పేర్కొంది. అలాగే జనవరి-మే 2011 కాలానికి మొత్తం విక్రయాలు కూడా రెండింతలు పెరిగాయి. ఈ కాలానికి ఆడి ఇండియా మొత్తం విక్రయాలు 1,167 యూనిట్ల నుంచి 2,394 యూనిట్లకు పెరిగాయి. ఓ వైపు ఇంధన ధరలు, వడ్డీ రేట్లు పెరుగుతున్నప్పటికీ కంపెనీ పటిష్ట వృద్ధిని సాధించిందని, తమ డీలర్ భాగస్వాములు మరియు నిజాయితీ గల వినియోగదారుల మద్దతుతో 2011 ఆడి ఇండియా ఓ అనిర్వచనీయమై సంవత్సరంగా మిగిలిపోతుందని కంపెనీ హెడ్ మైఖేల్ ప్రెష్కీ తెలిపారు.


Click it and Unblock the Notifications








