ఆడి ఆర్8 స్పైడర్ ఇప్పుడు భారత మార్కెట్లో..!

గంటకు 301 కిలోమీటర్ల గరిష్ట వేగంతో ప్రయాణించే ఈ కారు అర్బన్ ప్రాంతాల్లో లీటరుకు 4.9 కిలోమీటర్ల మైలేజ్ను, ఎక్స్ట్రా-అర్బన్ ప్రాంతాల్లో లీటరుకు 10.4 కిలోమీటర్ల మైలేజ్ను ఇస్తుందని కంపెనీ పేర్కొంది. ఇక దీని ధర విషయానికి వస్తే.. 1,47,22,000 (ఎక్స్-షోరూమ్ మహారాష్ట్ర)గా ఉంది. ఈ ఏడాది జవరిలో కూడా కంపెనీ "ఆర్8 వీ10" అనే ఓ లగ్జరీ కారును విడుదల చేసిన సంగతి తెలిసిందే. భారత లగ్జరీ కార్ మార్కెట్లో ప్రథమ స్థానాన్ని ఆక్రమించుకునేందుకు ఆడి ఇండియా పోటీ పడుతుంది.
ఈ నేపథ్యంలో ఇక్కడ తమ ఉత్పత్తుల శ్రేణిని విస్తరించే అంశంపై కంపెనీ దృష్టి సారిస్తోంది. ప్రస్తుతం దేశీయ లగ్జరీ కార్ మార్కెట్లో బిఎమ్డబ్ల్యూ మొదటి స్థానంలోనూ, మెర్సిడెస్ బెంజ్ రెండవ స్థానంలోనూ ఉండగా... ఆడి మూడవ స్థానంలో ఉంది. ఈ విభాగంలో తమ స్థిరత్వాన్ని మరింత పటిష్టం చేసుకోవడంతో పాటు నంబర్ వన్ స్థానాన్ని చేరుకునేందుకు కంపెనీ కృషి చేస్తోంది. ఇందులో భాగంగానే ఈ ఏడాది తొలి మూడు నెలల్లోనే కంపెనీ మూడు కొత్త మోడల్ కార్లను భారత్లో ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications








