ఆడి లగ్జరీ కార్లపై మనసుపడుతున్న భారతీయ మహిళలు

భారత్లో మధ్యతరగతి ఎగువ కుటుంబాలలో ఉన్న స్త్రీలు లగ్జరీ కార్లపై ఎక్కువగా ప్రీతి కనబరుస్తున్నారని బిజినెస్ లైన్ నివేదిక పేర్కొంది. భాలీవుడ్ నటీ, నటులు కత్రినా ఖైఫ్, రణ్బీర్ కపూర్ వంటి ఆడి ఆర్8 కార్లను కలిగి ఉన్న ప్రముఖుల పేర్లను కూడా ఆ నివేదిక ప్రచురించింది. లగ్జరీ డ్రైవ్ కోరుకునే స్త్రీలు స్పోర్ట్స్ యుటిలిటీ వాహనాలను (ఎస్యూవీ) ఎక్కువగా కొనుగోలు చేస్తుండటం పట్ల ఆడి ఇండియా హెడ్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. 2010లో ఆడి ఇండియా 60 శాతం వృద్ధిని సాధించి 3,000 యూనిట్లను విక్రయించిందని, లగ్జరీ కార్ లవర్స్ కోసం ఈ ఏడాది సరికొత్త మోడళ్లు అందుబాటులోకి రానున్నాయని ఆయన పేర్కొన్నారు.


Click it and Unblock the Notifications








