ఏప్రిల్ ఆటోమొబైల్ ఎగుమతులలో 30 శాతం వృద్ధి

కాగా.. గత నెల ఎగుమతులలో ద్విచక్ర వాహనాలే అధికంగా ఉన్నాయి. దేశపు రెండవ అతిపెద్ద ద్విచక్ర వాహన తయారీ సంస్థ బజాజ్ ఆటో 1,26,264 యూనిట్లను ఎగుమతి చేయగా, టీవీఎస్ మోటర్ కంపెనీ 10,769 యూనిట్లను ఎగుమతి చేశాయి. అలాగే ప్యాసింజర్ కార్ల ఎగుమతుల్లో హ్యుందాయ్ 13.17 శాతం తగ్గుదలను కనబరిచి 20,422 యూనిట్లను ఎగుమతి చేయగా, మారుతి సుజుకీ 24.10 శాతం క్షీణించి 9,819 యూనిట్లను విక్రయించింది.
అయితే కొత్తగా మార్కెట్లోకి వచ్చిన నిస్సాన్ మాత్రం 9,431 యూనిట్లు ఎగుమతులు చేసింది. గత ఏడాది నిస్సాన్ అస్సలు ఎగుమతులను ప్రారంభించలేదు. అలాగే.. ఫోర్డ్ ఇండియా ఎగుమతుల్లో ఏడు రెట్లు పెరిగి 1,167 యూనిట్లుగా ఉండగా, టాటా మోటార్స్ ఎగుమతుల్లో రెండు రెట్ల వృద్ధితో 1,041 వాహనాలు ఎగుమతి అయ్యాయి. ఇక వాణిజ్య వాహనాల విషయానికి వస్తే.. ఇవి 36.01 శాతం వృద్ధితో 5,246 యూనిట్లు ఎగుమతలు జరిగాయి. గతేడాది ఇవి 3,857 వాహనాలు మాత్రమే.


Click it and Unblock the Notifications








