పన్నుల భారం తగ్గించండి మహాప్రభో..: ఆటో కంపెనీల గోడు

ప్రస్తుతం పెద్దకార్ల (1,500 సీసీకు మించి ఇంజన్ సామర్థ్యం కలిగిన కార్ల)పై 22 శాతం ఎక్సైజ్ డ్యూటీతో పాటు అధనంగా రూ. 15,000 పన్నును ప్రభుత్వం వసూలు చేస్తుంది. వాహనం నాలుగు మీటర్ల కన్నా పొడవు కలిగి ఉండి పెట్రోల్ ఇంజన్ సామర్థ్యం 1,200 సీసీ మరియు డీజిల్ ఇంజన్ సామర్థ్యం 1,500 సీసీలకు మించి ఉన్న కార్లను పెద్దకార్లుగా గుర్తించడం జరుగుతుంది. వీటికన్నా తక్కువ ఉన్న వాటిని చిన్నకార్లుగా గుర్తించడం జరుగుతుంది. ప్రస్తుతం చిన్నకార్లపై 10 శాతం ఎక్సైజ్ సుంకాన్ని ప్రభుత్వం వసూలు చేస్తుంది.
మరోవైపు దిగుమతి చేసుకున్న కార్లపై కూడా.. ప్రభుత్వం ప్రస్తుతం అమలు చేస్తున్న కస్టమ్ డ్యూటీ విధానాన్ని మార్చాలని ఆటో పరిశ్రమ కోరుకుంటుంది. ఇలా చేయడం వల్ల ప్రభుత్వం దేశీయ ఆటో పరిశ్రమను రక్షించడంతో పాటు.. భారత్లో ఉన్న కార్ల తయారీదారులను ప్రోత్సహించినట్లు అవుతుందని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. ప్రతి బడ్జెట్ సమావేశాలకు ముందు భారత ఆటోమొబైల్ తయారీదారుల సంఘం (ఎస్ఐఏఎమ్) ప్రభుత్వానికి తమ నివేదికను సమర్పిస్తుంది.
ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా ఎస్ఐఏఎమ్ తమ నివేదికను ప్రభుత్వానికి అందజేసింది. అయితే దీనిపై స్పందించేందుకు మాత్రం ఎస్ఐఏఎమ్ అధికారులు నిరాకరించారు. గతేడాది మార్కెట్ అనుకూలంగా ఉండటంతో దేశీయ ఆటోమొబైల్ రంగం మార్కెట్ అంచనాలను తలకిందులు చేస్తూ.. 30 శాతం వృద్ధిని కనబరిచిన సంగతి తెలిసిందే..! మరి ఈ ఏడాది ఆటో పరిశ్రమ వృద్ధిపై ప్రభుత్వ నిర్ణయం ఏ విధమైన ప్రభావాలను చూపనుందో కాలమే నిర్ణయించాలి.


Click it and Unblock the Notifications








