కార్లపై ఇటు చమురు, అటు బ్యాంకుల ఉక్కుపాదం

Car
ఫెస్టివల్ సీజన్‌లో వినియోగదారులకు డబుల్ ధమాకా ఇవ్వాలనుకున్న ఆటోమొబైల్ కంపెనీలకు, ఇటు చమురు కంపెనీలు పెట్రోల్ ధరలను పెంచడం, అటు రిజర్వు బ్యాంకు కీలక వడ్డీ రేట్లను సవరిచడంతో డబుల్ షాక్ తలిగినట్లయింది. గడచిన గురువారం చమురు కంపెనీలు లీటరు పెట్రోల్‌పై రూ.3.14 ధరను పెంచగా, శుక్రవారం భారతీయ రిజర్వు బ్యాంక్ (ఆర్‌బిఐ) కీలక వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు పెంచింది.

ఇప్పటికే అమ్మకాలు లేక సతమవుతున్న ఆటోమొబైల్ కంపెనీలపై పెరిగిన ఇంధన, వడ్డీ రేట్ల ప్రభావం భారీగా పడనుంది. పెట్రోల్ ధరల పెంపు కారణంగా డీజిల్ కార్ల వినియోగం పెరిగి, డీజిల్ కార్లకు డిమాండ్ పెరుగుతుంది. మరోవైపు ఆర్‌బిఐ వడ్డీరేట్ల వడ్డింపు కారణంగా వాహనాలకు రుణ సదుపాయాన్ని అందించే బ్యాంకులన్నీ కూడా వడ్డీ రేట్లను పెంచే ఆస్కారం ఉంది. ఇలా ఆర్‌బిఐ వడ్డీ రేట్లను పెంచడం గతేడాది మార్చి నుంచి ఇది 12వసారి.

ఈ నేపథ్యంలో కొనుగోలుదారులు, కొత్త వాహనాల కొనుగోలు విషయంలో వెనకడుగు వేసే అవకాశాలు ఉన్నాయి. అసలే ప్రస్తుత పండుగ సీజన్‌పై కోటి ఆశలు పెట్టుకున్న ఆటోమేకర్లకు ఇది దండగ సీజన్‌గా మారనుంది. ఇదివరకే పెరిగిన ఇంధన ధరలు, వడ్డీ రేట్ల కారణంగా ఈ ఆర్థిక సంవత్సరంలో ఎన్నడూ లేనంతగా గడచిన ఆగస్టు నెలలో వాహన అమ్మకాలు పడిపోయాయి. ఈ నేపథ్యంలో కొనుగోలుదారులను ఆకట్టుకునేందుకు అమ్మకపుదారులు చేసే ప్రయత్నాలు ఎంత వరకూ విజయవంతమవుతాయో వేచి చూడాల్సిందే.

More from DriveSpark

Article Published On: Saturday, September 17, 2011, 15:27 [IST]
English summary
The Indian auto industry is shell shocked by the Reserve Bank OF India's decision to increase repo rates by another 25 basis points today. The industry has unanimously said the this move will hurt the auto industry which is already suffering a slump in sales.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+