పెరుగుతున్న వడ్డీ రేట్లతో ఆటో, రియాల్టీ రంగాలపై భారం: ప్రణబ్

ఇతర రంగాలతో పోలిస్తే.. ఆటోమొబైల్ మరియు రియల్ ఎస్టేట్ రంగాలనే వడ్డీ రేట్ల పెంపు అధికంగా బాధిస్తోందని, ద్రవ్యోల్బణాన్ని తగ్గించేందుకు గడచిన మార్చి 2010 నుంచి భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్బిఐ) ఇప్పటికే 11 సార్లు కీలక వడ్డీ రేట్లను సవరించిందని, అలాగే 325 బేసిస్ పాయింట్ల వరకూ రెపో, రివర్స్ రెపోలను సవరించిందని ప్రణబ్ తెలిపారు. లోక్సభకు లిఖితపూర్వక సమాధానమిచ్చిన ఆయన ప్రస్తుత మార్కెట్ పరిస్థితుల్లో అధికంగా నష్టపోయే విభాగాల్లో బ్యాంకులు, ఐటి సెక్టార్ కూడా ఉన్నాయని అన్నారు.


Click it and Unblock the Notifications








