ఈ ఏడాది ఆటో పరిశ్రమకు కష్టాలు తప్పవు: ఆటో కంపెనీలు

అధిక నిర్వహణ వ్యయం, ఇంధన ధరల పెంపులకు తోడు పెరుగుతున్న వడ్డీ రేట్లు ఈ సంవత్సరం (2011) మొత్తం దేశీయ ఆటో పరిశ్రమ విక్రయాలపై ప్రభావం చూపుతుందని, అయితే.. తమపై మాత్రం పెద్దగా ప్రభావం చూపబోదని జనరల్ మోటార్స ఉపాధ్యక్షుడు (కార్పొరేట్ అఫైర్స్) ఎ బాలేంద్రన్ తెలిపారు. ఈ ఏడాది జనవరి నెలలో జనరల్ మోటార్స్ విక్రయాలు 6 శాతం పెరిగి 9,984 యూనిట్లను విక్రయించామని, గతేడాది ఇదే సమయంలో 9,421 యూనిట్లు విక్రయించామని.. అలాగే ఈ ఫిబ్రవరిలో విక్రయాలు ఇలాగే కొనసాగుతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
ప్రస్తుతం మార్కెట్ సెంటిమెంట్ బలహీనంగా ఉండటం, ఆర్థికవృద్ధి రేటు మందగించడం, ద్రవ్యచలామణి (లిక్విడిటీ)ని కట్టడి చేయటం వంటివి ఆటో పరిశ్రమకు అనుకూలమైన అంశాలు కావని, వీటి ఫలితంగా ఉత్పత్తుల ధరలు పెరుగుతున్నాయని బాలేందర్ చెప్పారు. అంతేకాకుండా.. అంతర్జాతీయ మార్కెట్లో మూడి చమురు బ్యారెల్ ధర (క్రూడ్ ఆయిల్) 100 డాలర్లకు చేరువలో ఉండటం వల్ల మరోసారి ధరలు పెరుగువచ్చని ఆయన అంచనా వేశారు.
దేశంలోనే అతి పెద్ద కార్ల తయారీ సంస్థ అయిన మారుతి సుజుకి కూడా వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఆటో రంగం మంద గించవచ్చునని ఆందోళన వ్యక్తం చేసింది. ముఖ్యంగా అధిక ద్రవ్యోల్బణం, ధరల పెంపు, ఇంధన ధరలు ఆటో పరిశ్రమపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయని కంపెనీ జనరల్ మేనేజర్ (మార్కెటింగ్) శశాంక్ శ్రీవాత్సవ ఇటీవలే ప్రకటించిన సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications








