గుజరాత్కు తరలి వెళ్లనున్న బజాజ్ చిన్న కారు ప్రాజెక్ట్!

పారిశ్రామిక రంగానికి పెద్దపీట కల్పిస్తూ మోడి సర్కారు అనుసరిస్తున్న పారిశ్రామిక విధానాలు ఆటోమొబైల్ కంపెనీలను అయస్కాంతంలా ఆకర్షిస్తోంది. ఈ మేరకు గుజరాత్లోని ముంద్రా పోర్టుకు సమీపంలో ప్లాంటు ఏర్పాటు చేయాలని బజాజ్ ఆటో భావిస్తోంది. ఈ విషయంపై కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ రాజీవ్ బజాజ్ స్పందిస్తూ.. ముంద్రా ప్రాంతంలో భుమి దొరికితే సంతోషిస్తామని, ఇందుకు సంబంధించి గుజారత్ సర్కారుతో ఏ సమావేశాన్ని కూడా నిర్వహించనున్నామని తెలిపారు.
ముంద్రాలో ప్లాంటు ఏర్పాటు చేయడం ద్వారా ఆఫ్రికా దేశాల వంటి అంతర్జాతీయ మార్కెట్లకు ఎగుమతులను సులభతరం చేసుకోవచ్చునని కంపెనీ భావిస్తోంది. కాగా.. ఇప్పటికే గుజరాత్లో ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు దేశీయ అగ్రగామి కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ప్రయత్నిస్తుండగా, అమెరికా ఆటో దిగ్గజం ఫోర్డ్ మరియు ఫ్రెంచ్ కార్ల తయారీ సంస్థ ప్యూజో సిట్రాన్లతో భారత్ నెంబర్ వన్ ద్విచక్ర వాహన తయారీ కంపెనీ హీరో హోండా కూడా గుజరాత్ రాష్ట్రం వైపు మొగ్గు చూపుతోంది.


Click it and Unblock the Notifications








