డీలర్షిప్ సంఖ్యను మూడింతలకు పెంచనున్న బిఎమ్డబ్ల్యూ

కొత్త డీలర్ల ద్వారా ఇతర రీజన్లలో సేల్స్ను పెంచుకోవడం దృష్టి సారిస్తామని ఆయన తెలిపారు. ఈ 60 డీలర్షిప్లు చాలా తక్కువే అయినప్పటికీ భవిష్యత్ అభివృద్ధికి ఇవి పునాదుల్లాంటివని ఆయన వ్యాఖ్యానించారు. గతేడాది లగ్జరీ కార్ మార్కెట్లో పోటా పోటీ (మెర్సిడెస్ బెంజ్తో) రేస్ జరిగిందని, ఈ ఏడాది తమ కంపెనీ గతేడాది కన్నా వేగంగా వృద్ధి చెందుతోందని ఆయన తెలిపారు. 2020 సంవత్సరం నాటికి భారత లగ్జరీ కార్ మార్కెట్ డిమాండ్ 1,50,000 యూనిట్లకు పెరుగుతుందని ఆయన అంచనా వేశారు. ఈ ఏడాది ముగిసేనాటికి 10,000 యూనిట్లను విక్రయించాలని కంపెనీ భావిస్తోంది.


Click it and Unblock the Notifications








