చెన్నై ప్లాంటులో 20,000వ కారును ఉత్పత్తి చేసిన బిఎమ్డబ్ల్యూ

సాలీనా 10,000 యూనిట్లను ఉత్పత్తి చేసే సామర్థ్యం కలిగిన ఈ ప్లాంటులో బిఎమ్డబ్ల్యూ ఇటీవలే 20,000 యూనిట్లను ఉత్పత్తిని చేసిన తన ఖాతాలో మరో మైలురాయిని నమోదు చేసుకుంది. ఈ ప్లాంటును ఏర్పాటు చేసి సుమారు నాలుగు సంవత్సరాలు పూర్తి కావస్తుంది. బిఎమ్డబ్ల్యూ చెన్నై ప్లాంటులో 20,000వ కారు ఉత్పత్తిని మీడియాకు చూపిస్తున్న ప్లాంట్ మేనేజింగ్ డైరెక్టర్ జుర్గెన్ ఎడెర్ను పక్కచిత్రంలో గమనించవచ్చు.
మార్చి 2007లో ఈ ప్లాంటులో ఉత్పత్తి కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. ఇదే ప్లాంటులో నవంబర్ 2010లో కంపెనీ తన 10,000వ కారును విడుదల చేసింది. ఈ ప్లాంట్ సింగిల్ షిఫ్ట్ ప్రకారం నడుస్తూ, సంవత్సరానికి 5,400 కార్లను ఉత్పత్తి చేస్తుంది. ఇందులో 400 ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఈ ప్లాంట్ కోసం కంపెనీ రూ.110 కోట్లను పెట్టుబడి పెట్టింది. ఈ ఏడాది ఆరంభంలోనే ప్లాంటు ఉత్పత్తి సామర్థ్యాన్ని 10,000 యూనిట్లకు పెంచింది.


Click it and Unblock the Notifications








