ఇంజన్‌లను ఇక్కడే అసెంబ్లింగ్ చేస్తాం, ధరలు పెంచం: బిఎమ్‌డబ్ల్యూ

BMW
ఇటీవల కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన బడ్జెట్ 2011లో సవరణల కారణంగా విదేశీ ఆటోమొబైల్ కెంపెనీలు భారత్‌లో అసెంబ్లింగ్ చేస్తున్న కార్ల తయారీపై అధిక భారం పడుతుండటంతో పలు లగ్జరీ కార్ల తయారీ సంస్థలు తమ ఉత్పత్తుల ధరలను రూ. 10 లక్షల వరకూ పెంచేందుకు సిద్ధమయ్యాయి. ఈ నేపథ్యంలో జర్మనీకు చెందిన ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ బిఎమ్‌డబ్ల్యూ మాత్రం ఉత్పత్తుల ధరలను పెంచమని స్పష్టం చేసింది. తమ వాహనాల అసెంబ్లింగ్‌కు కావలసి ఇంజన్‌లు భారత్‌లోనే అసెంబ్లింగ్చేసుకుంటామని కంపెనీ పేర్కొంది.

మెర్సిడెస్ బెంజ్, ఆడి, బిఎమ్‌డబ్ల్యూ వంటి విదేశీ కంపెనీలు తమ కార్ల విడిభాగాలను భారత్‌కు దిగుమతి చేసుకొని ఇక్కడ అసెంబ్లింగ్ చేసి విక్రయిస్తారు, ఈ వ్యాపారాన్ని సికెడి బిజినెస్ అంటాం. అసెంబ్లింగ్‌కు అవసరమైన ఇంజన్‌, ట్రాన్స్‌మిషిన్‌, గేర్‌బాక్స్‌లపై బడ్జెట్ 2011లో భారత ప్రభుత్వం కస్టమ్స్‌ డ్యూటీని 30 శాతానికి పెంచిందిం. అంతకు ముందు ఇది 10 శాతంగా ఉండేది. దీంతో ఇకపై అసెంబ్లింగ్‌కు ఇంజన్‌లను భారత్‌లో తయారు చేసుకుంటామని, అందువల్ల ఉత్పాదక వ్యయం తగ్గుతుందని కంపెనీ తెలిపింది.

ప్రస్తుతం బిఎమ్‌డబ్ల్యూ 3 సిరీస్, 5 సిరీస్ మరియు ఎస్‌యూవీ ఎక్స్‌1 మోడళ్లను భారత్‌లో అసెంబ్లింగ్ చేస్తుంది. ఈ సందర్భంగా బిఎమ్‌డబ్ల్యూ అధ్యక్షుడు ఆండ్రియాస్‌ స్కాఫ్‌ మాట్లాడుతూ.. ప్రభుత్వం త్త దిగుమతి సుంకం పెంచినా దాన్ని తమ వినియోగదారులపై రుద్దబోమని చెప్పారు.

More from DriveSpark

Article Published On: Wednesday, May 11, 2011, 14:15 [IST]
English summary
Luxury car maker BMW India today said it has started assembling engines of 3 and 5 Series sedans and sports utility vehicle X1 at its Chennai plant from April to avoid the higher 30 per cent customs duty, following the new norms on completely knocked down units in the Budget.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+