భారత్లో నంబర్ వన్ లగ్జరీ కారు 'మెర్సిడెస్ బెంజ్'

లగ్జరీ కార్ మార్కెట్లో గట్టి పోటీ ఇస్తున్న ఆడి ఇండియా కూడా ఈ ఏడాది జనవరి విక్రయాలలో 56.86 శాతం వృద్ధిని సాధించి 480 కార్లను విక్రయించింది. గతేడాది ఇదే సమయంలో ఆడి విక్రయాలు 306 యూనిట్లుగా ఉన్నాయి. అయితే విక్రయాల విషయానికి వస్తే.. మెర్సిడెజ్ బెంజ్, ఆడి కంపెనీల కన్నా బిఎమ్డబ్ల్యు విక్రయాలే అధికంగా ఉన్నాయి. 2010 సంవత్సరంలో బిఎమ్డబ్ల్యు 6,246 యూనిట్లు విక్రయించి లగ్జరీ కార్ సెగ్మెంట్లో అగ్రభాగాన నిలువగా.. మెర్సిడెజ్బెంజ్ 5,819 యూనిట్లను, ఆడి 3,003 యూనిట్లు విక్రయించింది. ఈ ఏడాది చివరి నాటికి భారత్ లగ్జరీ కార్ మార్కెట్లో దాదాపు 15,000 విలాసవంతమైన కార్లు అమ్ముడవుతాయని అంచనా.


Click it and Unblock the Notifications








