హైబ్రిడ్ కార్ల తయారీ సంస్థలకు ప్రభుత్వం సహకరించాలి..!!

అయితే..ఈ వృద్ధి దేశ ఆర్థిక వ్యవస్థకు లాభాలు చేకూర్చి పెట్టినప్పటికీ..పర్యావరణానికి మాత్రం హాని చేస్తుంది. తక్కువ ధరలకే వాహనాలు లభిస్తుండటంతో దేశంలో వాహన యజమానుల సంఖ్య నానాటికీ పెరుగుతూ వస్తుంది. ఫలితంగా వాయు కాలుష్యం అధికమయ్యి పర్యావరణానికి ముప్పువాటిళ్లుతోంది. ఈ పరిణామాలను దృష్టిలో ఉంచుకొని ఈసారి బడ్జెట్లో ప్రభుత్వం పర్యావరణ సాన్నిహిత్యంగా (ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ) ఉండే వాహనాలకే అధిక ప్రాధాన్యం ఇవ్వాలని ప్రముఖ అకౌంటింగ్ సంస్థ ఎర్నెస్ట్ అండ్ యంగ్ అధికారి చేతన్ కాకారియా కోరారు. ఇందుకోసం హైబ్రిడ్ కార్లను తయారు చేసే సంస్థలు ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరించాలని ఆయన అన్నారు.


Click it and Unblock the Notifications








