సునామీ తర్వాత ప్లాంట్లను పునఃప్రారంభించిన ఆటో కంపెనీలు

జపాన్లో కంపెనీలు మూతపడటంతో వివిధ దేశాలలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న వాటి అనుబంధ సంస్థలపై కూడా తీవ్ర ప్రభావం పడింది. ముఖ్యంగా భారత్లో ఉన్న జపాన్ అనుబంధ సంస్థలైన మారుతి సుజుకి, టొయోటా కిర్లోస్కర్, హోండా సియోల్ వంటి వివిధ కంపెనీలపై ఈ ప్రభావం స్పష్టంగా కనబడుతోంది. ఈ నెల 11న మూతపడిన ప్లాంట్లలో ఏడింటిని కంపెనీ తాజాగా రీఓపెన్ చేసినట్లు టొయోటా పేర్కొంది.
కాగా.. ఇతర 22 ప్లాంట్లపై మార్చి 22న ఓ నిర్ణయం తీసుకోనుంది. అలాగే నిస్సాన్ మరియు వాటి అనుబంధ సంస్థలు ఒక్కొక్కటిగా తమ ప్లాంటను రీఓపెన్ చేస్తున్నాయి. ఇతర ఆటో దిగ్గజాలు హోండా మోటార్ కార్పోరేషన్, సుజుకి మోటార్ కార్పోరేషన్లు మాత్రం ఇంకా ప్లాంట్లను రీఓపెన్ చేయలేదు. మార్చి 20 వరకూ తమ ప్లాంట్లు మూసివేయబడి ఉంటాయని హోండా, మజ్దా కంపెనీలు పేర్కొన్నాయి. ఈ విషయంపై ఈ ఆదివారం ఆటో కంపెనీలు ఓ నిర్ణయం తీసుకోనున్నాయి.


Click it and Unblock the Notifications








