కార్ల దిగుమతి కుంభకోణం: యూపిఏ మంత్రి కుమార్తెపై విచారణ

యూరప్ వంటి దేశాల నుంచి దొంగిలించిన లగ్జరీ కార్లు, లేదా అక్రమంగా నకిలీ బిల్లులతో దిగుమతి చేసుకున్న కార్లు మన దేశంలో చాలానే ఉన్నాయి. ఈ కేసులో ఢిల్లీకు చెందిన ఓ హై ప్రొఫైల్ ఆటో వర్క్షాప్ యజమాని సుమిత్ వాలియాను అధికారులు అరెస్టు చేశారు. టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రచురించిన కథనం ప్రకారం.. మహారాష్ట్ర యూపిఏ మంత్రి కుమార్తె ఒక ఆడి, ఒక పోర్షే మరియు ఒక బిఎమ్డబ్ల్యూ కార్లను నకిలీ ఇన్వాయిస్తో సుమిత్ వాలియా సేవలను ఉపయోగించుకొని దిగుమతి చేసుకున్నట్లు సమాచారం.
ఈ కేసులో అడ్డంగా బుక్ అయిన అమిత్ వాలియా ద్వారా కార్లను కొనుగోలు/దిగుమతి చేసుకున్న హైప్రొఫైల్ వినియోగదారుల జాబితాను అధికారులు సంపాధించగలిగారు. దీని ద్వారా ఒక్కొక్కరినీ అధికారులు ప్రశ్నించనున్నారు. కాగా.. ఈ స్కామ్లో తొలుతగా విచారణ ఎదుర్కోనున్న వ్యక్తి మాహారాష్ట్రలో అత్యంత శక్తివంతమైన మంత్రి కుమార్తె కావడం గమనార్హం. అయితే, సదరు యూపిఏ మంత్రి మరియు అతని కుమార్తె పేర్లు, తదితర వివరాలను మాత్రం ఆ పత్రిక వెల్లడించలేదు.
గడచిన రెండు నెలలుగా దేశవ్యాప్తంగా ఫెరారీ, రోల్స్ రాయిస్, హమ్మర్స్, బెంట్లీ, ఆస్టన్ మార్టిన్, పోర్షే మరియు లాంబోర్గినీ వంటి పలు లగ్జరీ కార్లను దాదాపు 45 వరకూ డిఆర్ఐ అధికారులు సీజ్ చేశారు.


Click it and Unblock the Notifications








