డిస్కౌంట్లు, స్కీమ్లతో కస్టమర్లను ఆకట్టుకోనున్న కార్ల కంపెనీలు

విక్రయాలను పెంచుకోవాలంటే డిస్కౌంట్ ప్యాకేజీలను ఆఫర్ చేయడమే ఉత్తతమైన మార్గమని దేశపు అతిపెద్ద కార్ల తయారీ సంస్థ అయిన మారుతి సుజుకి ఇండియా ఛీఫ్ జనరల్ మేనేజర్ (మార్కెటింగ్) అభిప్రాయపడ్డారు. ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో డిస్కౌంట్లు చక్కగా పనిచేస్తాయని, వరుసగా రెండు నెలల పాటు తగ్గిన విక్రయాలను దృష్టిలో ఉంచుకొని జూన్ నెలలో డిస్కౌంట్లను ప్రకటించాలనే ప్రతిపాదనలు తీసుకువస్తున్నామని ఢిల్లీలోని మారుతి డీలర్ ఒకరు వెల్లడించారు. కార్ల కంపెనీలు దాదాపు రూ. 60,000 వరకూ నగదు ప్రోత్సాహకాలను ప్రకటించే అకాశాలున్నాయని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.


Click it and Unblock the Notifications








