సియట్ తొలి త్రైమాసిక నికర నష్టం రూ. 41.90 కోట్లు

అయితే, గడచిన త్రైమాసికంలో కంపెనీ నికర అమ్మకాలు మాత్రం రూ. 1,072.59 కోట్లకు పెరిగాయి. గడచిన ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో సియట్ నికర అమ్మకాలు రూ. 772.22 కోట్లుగా ఉన్నట్లు సియట్ తెలిపింది. పెరిగిన ముడి సరుకుల ధరలు, ప్రత్యేకించి సహజ రబ్బరు ధరలు మరియు హలోల్ (గుజరాత్)లోని కొత్త ప్లాంటులో ఉత్పత్తి సామర్థ్యాన్ని తక్కువగా ఉపయోగించుకోవడం వంటి అంశాలు కంపెనీ లాభాలపై ప్రభావం చూపాయని సియట్ వెల్లడించింది.


Click it and Unblock the Notifications








