ఈజిప్టు అల్లర్లు: మారుతి ఎగుమతులపై ప్రభావం

గత ఆర్థిక సంవత్సరంలో ఈజిప్టుకు 1.47 లక్షల యూనిట్ల కార్లను ఎగుమతి చేశామని, వీటిలో ఆల్టో విక్రయాలే అధికంగా ఉన్నాయని ఆయన తెలిపారు. ఈజిప్టు అల్లర్ల వల్ల నష్టపోయిన కంపెనీలలో ఏషియన్ పెయింట్స్, మారికో, డాబర్ వంటి కంపెనీలతో పాటు మారుతి కూడా ఒకటి. మారుతికి అత్యంత పటిష్టమైన యూరప్ మార్కెట్లో కూడా ప్రస్తుతం ఎగుమతులు మందగించాయి. మారుతి జనవరి ఎగుమతులు 36 శాతం పడిపోయాయి. జనవరి, 2010లో 14,562 యూనిట్లుగా ఉన్న ఎగుమతులు జనవరి, 2011లో 9,321 యూనిట్లకు పడిపోయినట్లు కంపెనీ పేర్కొంది.


Click it and Unblock the Notifications








