భారత్లో ప్లాంటు ఏర్పాటుకు ప్యూజో సిట్రాన్ సన్నాహాలు

అయితే ఈ సెడాన్ విడుదలకు సంబంధించి కంపెనీ ఇంకా సమయాన్ని ఖరారు చేయలేదు. రానున్న నాలుగేళ్లలో వివిధ విదేశీ మార్కెట్లలో 50 శాతం కార్లను విక్రయించాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. కంపెనీ కొత్తగా ఏర్పాటు చేయబోయే ప్లాంటును ఆంధ్రప్రదేశ్లో కానీ లేదా తమిళనాడులో కానీ స్థాపించాలని భావిస్తోంది. ఈ మేరకు ఇరు రాష్ట్ర ప్రభుత్వాలతో కూడా కంపెనీ చర్చలు జరిపింది. ఇప్పటికే ఆటోమోటివ్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఏఆర్ఏఐ) నుంచి కంపెనీ కొంత సమాచారాన్ని కూడా సేకరించింది. గతంలో ఈ సంస్థ భారత్లోని ప్రీమియుర్ గ్రూపుతో కలిసి పనిచేసింది. కానీ 2001లో ఈ జాయింట్ వెంచర్ నుంచి ప్యూజో వైదొలిగింది.


Click it and Unblock the Notifications








