మోడీ టైర్స్ను స్వాధీనం చేసుకున్న కాంటినెంటల్

ఎమ్టిసిఎల్లోని 100 శాతం వాటాల కొనుగోలుకు గానూ అయ్యే విలువ సుమారు రూ. 18.5 మిలియన్ యూరోలుగా ఉండొచ్చని అంచనా. ఈ డీల్కు సంబంధించిన ఆర్థిక వివరాలను ఇరు సంస్థలు గోప్యంగా ఉంచాయి. ఈ డీల్ ద్వారా ఎమ్టిసిఎల్ ఇప్పుడు కాంటినెంటల్ కార్పోరేషన్ పూర్తి అనుబంధ సంస్థగా మారింది. అంతేకాకుండా దీన్ని కాంటినెంటల్ టైర్స్ లిమిటెడ్ గా పేరు కూడా మార్చనున్నారు. ఇది ట్రక్కులు మరియు బస్సులకు బయాస్ మరియు రేడియల్ టైర్లను, అలాగే భారత మార్కెట్ కోసం ప్యాసింజర్ కార్ల ఉత్పత్తి, మరియు పంపిణీ వ్యవహారాలపై దృష్టి సారించనుంది.


Click it and Unblock the Notifications








