ఆటోమొబైల్స్, విడిభాగాలపై దిగుమతి సుంఖంలో కోత విధించండి

ప్రముఖ మార్కెట్ రీసెర్చ్ సంస్థ జెడి పవర్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రతన్ టాటా మాట్లాడుతూ.. ఇలాంటి అధిక దిగుమతి సుంఖాలు సరికాదని, ఇవి స్థానిక కంపెనీల రక్షణకు కృత్రిమ ఆటంకాలు కలిగిస్తాయని చెప్పారు. భారత్లో ఆటోమొబైల్ పరిశ్రమ లేదని, ఇక్కడ కేవలం విదేశీ బ్రాండ్లను అసెంబ్లింగ్ చేసే వారు మాత్రమే ఉన్నారని చెప్పారు. వాస్తవానికి మహీంద్రా అండ్ మహీంద్రా మరియు టాటా మోటార్స్ మాత్రమే దేశంలో ఉత్పత్తులను అభివృద్ధి, తయారీలను చేస్తున్నాయని తెలిపారు. అధిక ఇంపోర్ట్ డ్యూటీ రేట్లను తగ్గించాలని రతన్ టాటా అభిప్రాయపడ్డారు.
ప్రస్తుతం పూర్తిగా విదేశాల్లోనే తయారైన వాహనాలపై 60 శాతం కస్టమ్స్ డ్యూటీ ఉంటుంది. అది ఇండియాకు వచ్చే సరికి సేల్స్ టాక్స్, వ్యాట్, ఇతర ట్యాక్స్లను కలుపుకొని 100 శాతం అవుతుంది. అదే విడిభాగాలను భారత్కు తెచ్చుకొని ఇక్కడ అసెంబ్లింగ్ చేస్తే ఇంపోర్ట్ డ్యూటీ తగ్గుతుందే. ఇంజన్, ట్రాన్సిమిషన్, గేర్బాక్స్లపై భారత ప్రభుత్వం 30 శాతం దిగుమతి సుంఖాన్ని, ఇతర స్పేర్ పార్ట్లపై 10 శాతం దిగుమతి సుంఖాన్ని వసూలు చేస్తుంది. అందుకే విదేశీ కంపెనీలన్నీ కూడా తమ వాహనాలను ఇక్కడే అసెంబ్లింగ్ చేసేందుకు భారత్కు క్యూ కడుతున్నాయి. ఫలితంగా దేశీయ కంపెనీలు ఫారిన్ కంపెనీల నుండి ఎదురయ్యే పోటీని ఎదుర్కోవాల్సి వస్తుంది.


Click it and Unblock the Notifications








