ఢిల్లీ హైకోర్ట్ బ్లాస్ట్ - తీవ్రవాదులు వాడిన కారు గుర్తింపు!?

తాము ఓ రిజిస్టర్ నెంబర్ను ట్రేస్ చేశామని, అయితే ఫేక్ నెంబర్ అయి ఉండొచ్చని భావిస్తున్న పోలీసు ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. కాగా.. ప్రముఖ ఆంగ్ర పత్రిక టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రచురించిన కథనం ప్రకారం, తీవ్రవాదాలు ఓ హ్యుందాయ్ యాక్సెంట్ సెడాన్ కారును ఉపయోగించారని, దాని రిజిస్ట్రేషన్ నెంబర్ డిఎల్9సిఏ 6034 అని ప్రచురించింది.
ఈ బ్లాస్ట్ కోసం తీవ్రవాదులు పిఈటిఎన్ (పెంటాఎర్తిరిటాల్ ట్రైనేట్రేట్) అనే నైట్రోజన్ ఆధారిత మిశ్రమాన్ని ఉపయోగించినట్లు ప్రాధమిక విచారణలో తేలింది. ఇది అత్యంత శక్తివంతమైన పేలుడు పదార్థం. ఈ పధార్థాన్ని మెటల్ డిటెక్టర్లు సైతం గుర్తించలేవు. 3-4 కిలోల బరువున్న ఈ పేలుడు పదార్థాన్ని కోర్టు ఎంట్రన్స్లోని రిసెప్షన్ సెంటర్ వద్ద ఉంచారు.
బుధవారం ఉదయం రద్దీ సమయం కావడంతో ప్రమాద స్థాయి తీవ్రంగా ఉంది. ఈ పేలుడు కారణంగా ఇప్పటి వరకూ 12 మంది మృతి చెందగా, సుమారు 75 మందికి పైగా క్షతగాత్రులయ్యారు. ఈ పేలుడుకు బాధ్యత వహిస్తున్నట్లు హర్కత్-ఉల్-జిహాదీ ప్రకటించినప్పటికీ పలు ఇతర ఉగ్రవాద సంస్థలపై నిఘా వర్గాలు అనామానాలు వ్యక్తం చేస్తున్నాయి.


Click it and Unblock the Notifications








