అంబాసిడర్ పోయి మారుతి ఎస్ఎక్స్4 వచ్చే టాం.. టాం..!!

ఇంధనాన్ని ఆదా చేయడంతో పాటు వేగంగా పనులను పూర్తి చేయాలనే ఉద్దేశంతో ఈ కార్ల కొనుగోలు ప్రక్రియను ప్రారభించామని ఢిల్లీ పోలీస్ కమిషనర్ బికె గుప్తా పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన ఓ ప్రతిపాదనను చాలా కాల క్రితమే కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ముందు ఉంచగా.. దానికి తాజాగా ఆమోదం లభించింది. ఇంధనం, స్పీడ్, మెయింటినెన్స్ ఖర్చు, సౌకర్యాలను దృష్టిలో ఉంచుకొని అంబాసిడర్ కార్ల స్థానంలో ఈ కార్లను రీప్లేస్ చేస్తున్నామని కమిషనర్ వెల్లడించారు.
ఇప్పటికే 12 మారుతి సుజుకి ఎస్ఎక్స్4 కార్లను ఢిల్లీ పోలీసులకు అందించడం కూడా జరిగింది. కొత్త ఎస్ఎక్స్4 కార్లలో భద్రతా కారణల కోసం ప్రత్యేకంగా రేడియో ట్యాగ్లను బిగించబడి ఉంటాయి. పోలీసు కార్లనగానే అంబాసిడర్ కార్లే గుర్తుకు వచ్చేవి. ఒకప్పటి స్టేటస్ సింబల్ అయిన అంబాసిడర్ కారు ఇప్పుడు పోలీసులకు కూడా పనికిరాకుండా పోతుంది. ఏదేమైనప్పటికీ అంబాసిడర్ కార్లలో ఉన్న రాజసం ఈ కాలపు కార్లతో వస్తుందా..!


Click it and Unblock the Notifications








