వచ్చే నెల నుంచి మరింత ప్రియం కానున్న డీజిల్, ఎల్పిజి!?

ఈ నేపథ్యంలో ఇటీవల సమావేశమైన కేంద్ర మంత్రుల సాధికార బృందం డీజిల్ ధరలను యధావిథంగా ఉంచింది. అయితే తాజాగా.. డీజిల్, ఎల్పిజి మరియు కిరోసిన్ ధరలను సమీక్షించేందుకు కేంద్ర ఆర్థకమంత్రి ప్రణబ్ ముఖర్జీ ఆద్వర్యంలోని మంత్రుల సాధికారిక బృందం మరోసారి జూన్ 9న సమావేశం కానుందని చమురు మంత్రిత్వ శాఖ అధికారులు వెల్లడించారు. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరు పెరుగుతున్నందున డీజిల్, ఎల్పిజి మరియు కిరోసిన్ ధరలు కూడా పెరిగే అవకాశం ఉందని, డీజిల్ ధరపై రూ. 4 పెంపును, వంట గ్యాస్ సిలిండర్పై రూ. 20-25 మేర పెంపును విధించే అవకాశం వారు ఉందని తెలిపారు. కిరోసిన్ పెంపు అంశం కూడా పరిశీలనలో ఉంది. ఈసారి ధరల పెంపు ఖచ్చితమని పరిశ్రమ వర్గాలు కూడా భావిస్తున్నాయి.


Click it and Unblock the Notifications








